Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రైతు భరోసా' ప్రారంభ సభలో సీిఎం జగన్
నెల్లూరు : జీడీపీ పెరుగుదలే అభివృద్ధికి కొలమానం కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ న్రెడ్డి అన్నారు. రైతు భరోసా-పీిఎం కిసాన్ పథకాన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ మైదానంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ 'కొందరు జీడీపీ పెరుగుదలనే అభివృద్ధిగా చెప్పుకుంటారు. నాకు రైతులే ముఖ్యం. వారు ఆనందంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉన్నట్టే. దీనినే నేను నమ్ముతా' అని ఆయన అన్నారు. రైతుకు భరోసా ఉంటేనే రాష్ట్రానికీ భరోసా ఉంటుందన్నారు. 'ఇచ్చిన హామీని ముందుగా, చెప్పిన దాని కంటే మిన్నగా. రైతులకు భరోసా కల్పించాం' అని వ్యాఖ్యా నించారు. 2017 జులై ఎనిమిదిన జరిగిన వైసీపీ సమావే ేశంలో రాష్ట్రంలోని రైతులకు హామీ ఇచ్చాన న్నారు. తాను అధికారంలోకి వస్తే ఏటా రూ.12,500 చొప్పున ఐదేండ్లకు రూ.50 వేలు ఇస్తానని ప్రకటించానని పేర్కొన్నారు.