Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ప్రత్యేక పిలుపు.. తమిళిసై ఢిల్లీ టూర్పై సర్వత్రా ఆసక్తి
- గవర్నర్ అయ్యాక తొలిసారి మోడీ, షాతో భేటీ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళిసై సౌందర్రాజన్ పదవీ బాధ్యతలు స్వీకరించాక.. తొలిసారి ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీకావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నాక.. ఇలా సమావేశమవడం మర్యాదపూర్వకమే అయినప్పటికీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు గవర్నర్ను కలిసి ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ముందుగా ఖరారు అయిన అపాయింట్మెంట్ సమయానికి సిద్ధంగా ఉన్నా రు. కానీ, ప్రధాని మోడీ హర్యానా ఎన్నికల ప్రచారం నుంచి ఆలస్యంగా ఢిల్లీకి చేరడంతో ముందుగా ఖరారు చేసిన అపాయింట్మెంట్ రద్దయింది. మంగళవారం సా యంత్రం ఆరు గంటలకు మోడీతో లోక్కళ్యాణ్మార్గ్లో ఉన్న పీఎం నివాసంలో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీలో గవర్నర్ రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులను వివరిం చినట్టు తెలిసింది. ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీ సులు ఇచ్చిన సమాచారంతో పాటు కార్మికుల డిమాండ్లు, ఆందోళనలు, కార్మికులను తొలగించినట్టు ప్రభుత్వం చేసిన ప్రకటన, ఇద్దరు కార్మికుల ఆత్మహత్యలు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్రానికి అందజేపిన నివేదికలో పొందుపర్చినట్టు తెలిసింది. అదేవిధంగా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్భవన్లో చేపట్టిన కార్యక్రమాలను కూడా తెలియజేసినట్టు గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. బతుకమ్మ ఉత్సవాలు, ప్లాస్టిక్ నిషేధం, యోగా తరగతుల ఏర్పాటు, రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదానం వంటి కార్యక్రమాలను ప్రధాని మెచ్చుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రధానికి అందజేసినట్టు వెల్లడించారు. ప్రధానికి హస్తకళల మెమెంటో, పోచంపల్లి శాలువాను గవర్నర్ బహుకరించారు.
క్షేత్రస్థాయిలో ఆర్టీసీ ప్రభావంపై ఆరా
ఆర్టీసీ కార్మికుల సమ్మె క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందన్న విషయాన్ని మోడీ ఆరా తీసినట్టు సమాచారం. సమ్మె వ్యతిరేకత ప్రజానీకంలో చర్చ కాకుండా ప్రభుత్వం స్కూల్, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించిన విషయాన్ని గవర్నర్ వివరించారు. దాంతోపాటు, తెలంగాణ సర్కారు పోలీసులకు సెలవులను రద్దు చేసినట్టు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బస్ డిపో, బస్టాండుతో పాటు ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ బలగాలు మోహరించి ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ నేపథ్యంలో ఏర్పడే పరిస్థితిపై కూడా మోడీ వివరించినట్టు సమాచారం. కాగా, ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ను కూడా గవర్నర్ కేంద్రం దష్టికి తీసుకెళ్లారు.