Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగదు విత్డ్రాపై ఆంక్షల వల్లే : బంధువులు
ముంబయి: 'పంజాబ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్' (పీఎంసీ) బ్యాంక్లో నగదు విత్డ్రాపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో తీవ్ర ఆందోళన చెందిన ఓ ఖాతాదురుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ముం బయిలోని ఓషివారా ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సంజయ్ గులాటీ (51) అనే ఖాతాదారుడు పీఎంసీలోని ఓషీవారా బ్రాంచ్లో రూ.90 లక్షలు జమచేసుకున్నాడు. ఈ డబ్బులతోనే కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి చికిత్స చేయిస్తున్నాడు. ఇదే సమయంలో పీఎంసీ బ్యాంక్లో రూ.3,843కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఆర్బీఐ ఆ బ్యాంక్లో జరిపే లావాదేవీలపై ఆంక్షలు విధించింది. రోజుకు రూ.25 వేలు మాత్రమే విత్డ్రా చేసుకునేలా పరిమితులు విధించింది. ఈ ఆంక్షలతో ఆయన కొడుకు చికిత్సకు సరపడా డబ్బులు పీఎంసీ బ్యాంక్ నుంచి సంజరు పొందలేక పోయాడు. దీంతో తన కొడుకు చికిత్స ఎక్కడ ఆగిపోతుందేమోననే భ యం సంజరులో కలిగింది. ఇదే క్రమంలో పీఎంసీ కుంభకోణంలోని నిందితు లను ముంబయిలోని కిల్లా కోర్టులో ప్రవేశపెడుతున్నారని తెలియడంతో ఖాతా దారులంతా కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. అందులో సంజయ్ కూడా పా ల్గొన్నాడు. నిరసన అనంతరం ఇంటికెళ్లిన సంజరుకు.. బోజనం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే సంజయ్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. నగదు విత్డ్రాపై ఆంక్షలు విధించడం వల్లే సంజరు మృతి చెందాడని బంధువుల ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటన అనంతరం విత్డ్రావల్ పరిమితిని రూ.25వేల నుంచి రూ.40వేలకు పెంచుతూ ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం.