Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్కు బీజేపీ నేతల ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను కొట్టేసే కుట్ర జరుగుతున్నదనీ, సమ్మెపై హైకోర్టు ఆదేశాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, పైగా హైకోర్టును తప్పుపట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై లక్ష్మణ్ నేతృత్వంలోని బీజేపీ బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను బుధవారం కలిశారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా రూ. వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, వాటిని కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని తెలిపారు.