Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నివారించడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు చొరవ చూ పాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, విశ్వవిద్యాలయాల కాంట్రాక్టు అధ్యాపకుల సం ఘం అధ్యక్షులు జి రామేశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ లోడి, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షులు జి ఉదయభాస్కర్, సునీల్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం విద్యారంగంపై పడుతున్నదని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ విద్యారంగం నష్టపోయే అవకాశముందని పేర్కొన్నారు. గతంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యమాలు చేసినపుడు ప్రభుత్వం చొరవ చూపించిందని గుర్తు చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసిందని తెలిపారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్టీసీని నడిపిస్తే ఇతర లాభాలుం టాయని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు శ్రీనివా స్రెడ్డి, సురేందర్గౌడ్ల మృతికి సంతాపం, వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మెకు సీపీఎస్టీఈఏ మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీపీఎస్టీఈఏ అధ్యక్షులు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులు చేసే పోరాటంలో న్యాయముందని తెలిపారు. జీతభత్యాల కోసం సమ్మె చేయడం లేదనీ, ఆర్టీసీ పరిరక్షణ కోసమే జరుగుతున్నదనీ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, సమ్మెను నివారించాలని కోరారు.