Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్పై లైంగికదాడి ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని 'మాస్టర్ ఆఫ్ లా' (ఎల్ఎల్ఎం) కోర్సులో ప్రవేశం పొందింది. కోర్టు ఆదేశాల మేరకు లా విద్యార్థినిని బరేలీలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వర్సిటీ కాలేజీకి పోలీసులు శుక్రవారం తీసుకెళ్లారు. అక్కడ ఆమె పూర్తి వివరాలతో కూడిన ప్రవేశ పత్రాలను కాలేజీలో అందజేసి అడ్మిషన్ పొందినట్టు పోలీసులు వివరించారు. కాగా, మాజీ మంత్రి చిన్మయానంద్ బాధితురాలిని లొంగదీసుకుని కొన్నెండ్లుగా లైంగికదాడి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, నిందితుడి నుంచి డబ్బులు వసూలు చేయడానికి బాధితురాలు తన స్నేహితులతో కుట్రపన్నారని ఆమెపై కేసు నమోదు కావడం గమనార్హం.