Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కిసాన్సభ త్రిపుర శాఖ కార్యదర్శి, మాజీ ఎంపీ, ప్రస్తుత ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు నారాయణ్ కార్ అరెస్టును అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్రంగా ఖండించింది. తప్పుడు ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేయడాన్ని నిరసించింది. కాగా, నారాయణ కార్కు అదేరోజు బెయిల్ లభించింది. తగిన కారణం లేకుండా సీనియర్ నేతను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, ఈ చర్య బీజేపీ -ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో త్రిపుర ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ స్వభావాన్ని బహిర్గతం చేస్తున్నదని ఏఐకేఎస్ పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, లేనిపక్షంలో రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు చేపడతామని ఏఐకేఎస్ హెచ్చరించింది.