Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన విమాన ప్రయాణికుల రద్దీఆర్థికమాంద్యమే కారణం : డీజీసీఏ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: ఇప్పటికే ఆటోమొబైల్, ఐటీ సహా అనేక రంగాలను సంక్షోభంలో కూరుకుపోగా.. ఇప్పుడు దాని సెగలు దేశీయ విమానయాన రంగాన్ని కూడా తాకాయి. ఈ విషయాన్ని 'డైరెక్టరెట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' (డీజీసీఏ) తాజాగా విడుదల చేసిన నివేదికనే స్పష్టం చేస్తున్నది. నాలుగు నెలలుగా భారత్ నుంచి విమాన ప్రయాణికుల రద్దీ తగ్గుతుండటంతో విమానయాన రంగం కూడా మందగమనాన్ని అనుభవిస్తున్నట్టు డీజీసీఏ పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. ఆర్థిక మందగమనంతో పాటు ఇతర కారణాల వల్ల ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య ఆగస్టులో 11.79 మిలియన్ల నుంచి సెప్టెంబరులో 11.53 మిలియన్లకు పడిపోయింది. దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ గత సెప్టెంబర్తో పోల్చితే కేవలం 1.18శాతం మాత్రమే పెరిగింది. దీంతో విమానయాన సంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.