Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ సర్కార్ హైకోర్టులో పిటిషన్
జైపూర్ : రాజస్థాన్లోని అల్వార్లో గో రక్షకుల మూకదాడిలో దారుణహత్యకు గురైన పెహ్లూఖాన్ హత్యకేసులో నిందితుల విడుదలను రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో సవాలుచేసింది. సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో మొత్తం ఆరుగురు నిందితులను అల్వార్ కోర్టు ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. పశువుల స్మగ్లింగ్కు పాల్పడుతున్నాడన్న అనుమానంతో 2017 ఏప్రిల్లో పాడి రైతు పెహ్లూఖాన్ను గో రక్షకులు తీవ్రంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. తీవ్రగాయాలైన పెహ్లూఖాన్ ఆస్పత్రిలో చేర్చగా మూడు రోజుల తర్వాత మృతిచెందాడు. పెహ్లూఖాన్ కేసును తిరిగి విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేస్తామనీ, దర్యాప్తులో పోలీసుల లొసుగులను పరిశీలిస్తామని రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టుకు దాఖలుచేసిన పిటిషన్లో పేర్కొంది.