Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా..
- కేంద్రానికి సిఫారసు చేసిన ప్రస్తుత సీజేఐ రంజన్ గొగొరు
నూతన సీజేఐగా జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అరవింద్ బోబ్డే నియమితులు కానున్నారు. ప్రస్తుత చీఫ్జస్టిస్ రంజన్ గొగోరు తన తర్వాత సీనియర్ న్యాయమూర్తియైన జస్టిస్ ఎస్ఏ బోబ్డేను తదుపరి చీఫ్జస్టిస్గా సిఫా రసు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు శుక్రవారం లేఖ రాశారు. తన పదవీ విరమణకు ముందు తన తర్వాత చీఫ్జస్టిస్ను కేంద్రానికి సిఫారసు చేయడమనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా పాటించే సంప్రదాయం. జస్టిస్ గొగోరు 46వ ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది అక్టోబర్ 3న ప్రమాణం చేశారు. నవంబర్ 17న జస్టిస్ గొగోరు రిటైర్ కానున్నారు. జస్టిస్ బోబ్డే నవంబర్ 18న నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు.