Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారదర్శకత లోపించడంపై ఆందోళన
- ఒప్పందం దురదృష్టకరమన్న ఆర్జేడీ నేత మనోజ్ ఝా
న్యూఢిల్లీ: ఇప్పటికే అవినీతి ఆరోపణలతో, ఇతర సమస్యలతో పీకల లోతు ఇబ్బందుల్లో ఉన్న కేంద్రం మరో వివాదాస్పద ఒప్పందం చేసుకుంది. సాధారణంగా ఒక సంస్థతో అధికారిక ఒప్పందం చేసుకునే ముందు ప్రభుత్వం కనీస నియమ నిబంధనలు పాటించాలి. అధికారిక ఒప్పందాల న్నింటికీ టెండర్ విధానాన్ని అవలంభిస్తారు. మొదట ఆ అంశాన్ని నోటిఫై చేస్తారు. దీని కోసం ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు. ఆ నియమ నిబంధనలన్నింటిని తుంగలో తొక్కి తన అధికారానికి ఎదురు లేదనే ఉద్దేశంతో తమకు దగ్గరి వాడైన రాందేవ్బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సంస్థతో తాజాగా లడక్లో చేసుకున్న ఒప్పందం అనేక విమర్శలకు తావిస్తున్నది. ఈ ఒప్పందం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. కేవలం సంఫ్ుపరివార్తో సత్సంబంధాలు కలిగిన రాందేవ్ బాబా సంస్థతోనే ఈ ఒప్పందం ఎందుకు చేసుకోవలసి వచ్చిందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రక్షణ మంత్రి ఆదివారం లడక్లోని లేV్ా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన సైనిక విభాగానికి చెందిన అధికారులను కలుసుకున్నారు. పాకిస్థాన్తో చర్చలు రద్దయిన సందర్భంగా సరిహద్దులో సైన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే సైనిక విభాగం జారీ చేసిన పత్రికా ప్రకటనలో కేవలం ఆర్మీ అధికారులతో కలిసిన సమాచారం మాత్రమే ఇచ్చారు. రాందేవ్తో చేసుకున్న ఒప్పందాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందని మీడియా ప్రశ్నిం చింది. అంతకంటే ముఖ్యంగా డిఆర్డివో ప్రయోగ శాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్సింగ్, డిఆర్డిఓ చీఫ్ క్రిస్టో˜ఫర్ హాజరయ్యారు. మూలికా, ఆహార ఉత్పత్తుల తయారీ దేశ విదేశాల్లో మార్కె టింగ్ సేవల కోసం భారత రక్షణరంగ సంస్థ (డిఆర్డిఓ), పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ సంస్థతో ఆదివారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకు నేలా ఈ ఒప్పందం జరిగింది. ఈ సంద ర్భంగా రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ మాట్లా డుతూ సీబక్థోర్న్ టెక్నాలజీతో వాణిజ్య పరమైన ఉపయో గాలతో పాటు మిగిలిన వాటిని పతంజలి ఆయుర్వేద సంస్థ వెలికి తీస్తుందని పారీకర్ చెప్పారు.
పతంజలి సంస్థతో డిఆర్డిఓ ఒప్పందం దురదృష్టకరం: ఆర్జేడీ నేత మనోజ్ ఝా
డిఆర్డిఓ పతంజలి ఆయుర్వేద సంస్థతో మూలికా ఉత్పత్తుల కోసం, వాటి పంపిణీ కోసం ఒప్పందం చేసుకోవడం దురదృష్టకరమని ఆర్జేడీ నేత మనోజ్ ఝా పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని ఆయన దిగజారిన రాజకీయాలకు ప్రతీక అని ఆరోపించారు. దేశంలోని ఉన్నత రక్షణ సంస్థ ఒక ప్రయివేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు.గత ఎన్నికల్లో తాను అధికారం చేపట్టేందుకు సహాయ పడిన వ్యక్తులకు, సంస్థలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదో ఒక రూపంలో లబ్ది చేకూరుస్తున్నదని ఝా ఆరోపించారు. అంతే కాకుండా ఆర్ఎస్ఎస్ భావ జాలంతో ముద్రించిన పుస్తకాలను డిఆర్డివో అధికారికంగా అమ్ముతున్నదని కూడా ఆయన ధ్వజమెత్తారు.