Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆర్టీసీ సమ్మెపై జాతీయ బీసీ కమిషన్ సీరియస్ అయింది. ఈ నెల 25న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచార్య తల్లోజు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఇచ్చిన వినతి పత్రంపై శనివారం జాతీయ వెనుకబడిన తరగతుల(బీసీ) కమిషన్ స్పందించింది. ఈ నెల 25న మధ్యాహ్నం 1 గంటకు వ్యక్తిగతంగా హాజరుకావాలని, ఆర్టీసీ కార్మికులు తెలిపిన అంశాలపై చర్చించాల్సి ఉందని సీఎస్కు తెలిపింది. ఈ సమావేశానికి ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కూడిన నివేదిక, మీరు తీసుకున్న చర్యలకు సంబంధించిన రిపోర్టు తీసుకురావాలని సూచించింది.