Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపై దృష్టి పెట్టాలన్న కపిల్ సిబాల్
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 కారణంగా జమ్ముకాశ్మీర్లో అభివృద్ధి వెనకబడిందని బీజేపీి చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్సిబాల్ తిప్పికొట్టారు. రాజకీయలబ్ది కోసమే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రధాని మోడీ, అమిత్షాలు లేవనెత్తారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కారణంగానే పాక్ నుంచి 'అంతర్భాగం' విడిపోయిందని మోడీ ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు. మోడీ ఆర్టికల్ 370ని మాత్రమే గుర్తు పెట్టుకున్నారని, అయితే పాకిస్థాన్ ఎప్పుడు విడిపోయింది. ఎవరు చేశారు అనే అంశాలు మోడీకి తెలియదని విమర్శించారు. మోడీ దృష్టి కేవలం ఆర్టికల్ 370 రద్దు అంశం పైనే ఉందని, పోషకాహార స్థాయిని, జీవన ప్రమాణాలను పెంచడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం వంటి రాజ్యాంగ విధులపై దృష్టి పెట్టడంలేదని ఆరోపించారు. సుమారు 93 శాతం మంది పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్; మధ్యప్రదేశ్, గుజరాత్ల్లో పేదరికం, శిశుమరణాలు, నిరుద్యోగితరేటును, మానవ అభివృద్ధి సూచీ పూర్తిగా వెనక పట్టు పట్టాయని వ్యాఖ్యానించారు. అయితే ఈ రాష్ట్రాల్లో ఆర్టికల్ 370 లేకపోయినా ఎందుకు వెనకబడ్డాయని ప్రశ్నించారు. 'మోడీజీ దయచేసి స్పందించండి.. మీరు గత ఐదున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్నందున ఏం జరుగుతుందో గమనించాలి' అని సిబల్ వ్యాఖ్యానించారు.