Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రక్కు డ్రైవర్ మృతి
ముంబయి: మహారాష్ట్రలోని కొల్హాపూర్లో బెంగళూరు-ముంబయి రహాదారిపై పేలుడు సంభవించింది. శుక్రవారం రాత్రి చోటుచేసుక్ను ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాదవ్వాడీ ప్రాంతానికి చెందిన దత్తత్రేయ పాటిల్ (51) అనే ట్రక్కు డ్రైవర్ షీర్గావ్లోని ఎంఐడీసీలో సరుకులను రవాణా చేసి తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో కొల్హాపూర్కు చేరుకోగానే ఉన్నట్టుండీ ట్రక్కు ఆగిపోయింది. దీంతో సాయంకోసం తన స్నేహితుడికి ఫోన్చేసి రమ్మనడంతో స్నేహితుడు వచ్చి, ట్రక్కుకు కాస్త దూరంగా నిలుచున్నాడు. ఈ లోపు దత్తత్రేయ ట్రక్కును పరిశీలిస్తుండగా, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి తీవ్రగాయాలపాలైన దత్తత్రేయను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ట్రక్కులోనే పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలోనూ విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.