Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులు శనివారం రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ఎత్తున నిరసన చేపట్టారు. పీఎంసీ బ్యాంకులో రూ4,335 కోట్ల కుంభకోణం జరిగిందనే వార్తలు వెలుగులోకి రావడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వారంతా రిజర్వ్ బ్యాంకు ఎదుట ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నిరసన గళాలను వినిపించారు. నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమకు సత్వరమే న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఖాతాదారులు తమ ఖాతాల నుంచి కేవలం 40వేల రూపాయాలను మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి ఆర్బీఐ వీలు కల్పించింది. కానీ ,ఈ నిబంధనకు వ్యతిరేకంగా 500 మంది ఖాతాదారులు హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేసిన విషయం తెలిసిందే.