Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్ పోలీస్ చీఫ్
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు ఆంక్షల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లో ఇంకా అసాధారణ పరిస్థితులే కొనసాగుతున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ పోలీసు చీఫ్ దిల్బర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అవిభాజిత రాష్ట్రమంతటా ఎవరూ ఆందోళనలు చేయకూడదు. నిరసనలను పూర్తిగా నిషేధిస్తున్నాం. ఆంక్షలు ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుంద'ని వెల్లడించారు. లోయలో శాంతిని నెలకొల్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తూ మంగళవారం పలువురు స్థానికులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు నాయకత్వం వహించిన ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయా, అతని కుమార్తె సఫియా సహా పదుల సంఖ్యలో మహిళలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
'బీడీసీ' ఎన్నికల్లో 27 మంది ఏకగ్రీవం
జమ్మూకాశ్మీర్లోని వివిధ 'బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్' (బీడీసీ) ఎన్నికల్లో 27 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి శైలేంద్ర కుమార్ బీడీసీ ఎన్నికల వివరాలను వెల్లడించారు. 283 బీడీసీ అధ్యక్షుల పోటీల్లో 1065 మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నారు. తుదిదశలో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో వివిధ ప్రాంతాల్లోని బీడీసీలకు 27 మంది పోటీలేకుండానే ఎన్నికయ్యారని వెల్లడించారు. బీడీసీ ఎన్నికలు ఈ నెల 24న జరుగనున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.