Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ఆకలి సూచీలో అట్టడుగున దేశం
- అభత్రలో ముస్లిం, మైనార్టీలు : మాజీ ఎంపీ మహమ్మద్ సలీం
కర్నూలు : మోడీ ప్రభుత్వం ఆధిపత్యం కోసం మతం పేరుతో మనుషులను విభజించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పశ్చిమబెంగాల్ మాజీ ఎంపీ మహ్మద్ సలీం అన్నారు. నిర్భయంగా, ఐక్యంగా బీజేపీ విధానాలను తిప్పికొట్టి మానవత్వాన్ని చాటాలని సూచించారు. 'వర్తమాన పరిస్థితులు-మైనారిటీ ప్రజలపై ప్రభావం' అనే అంశంపై కర్నూలులోని ఇస్లామియా అరబిక్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆవాజ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఎస్ఎ.సుభాన్ అధ్యక్షతన ఆదివారం సదస్సు నిర్వహించారు. మహమ్మద్ సలీం మాట్లాడుతూ దేశంలో ముస్లిం ప్రజలు అభద్రతకు గురవుతున్నారన్నారు. ప్రపంచ ఆకలి సూచిలో దేశం అట్టడుగున ఉందన్నారు. మోడీ పాలనలో మతం పేరుతో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో పోరాడాలని సూచించారు. ముస్లిం, మైనారీటీలపై విద్వేషాలను పెంచే విష ప్రచారం సంఫ్ు పరివార్ శక్తులు చేస్తున్నాయన్నారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి వారి హక్కులను హరించి మిలిటరీ పాలనలో మగ్గే విధంగా చేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ బీజేపీ విధానాల వల్ల దేశం ప్రమాదంలో ఉందన్నారు. చంద్రబాబు, జగన్లపై కేసులున్నాయని, వీరిని బీజేపీిలో కలుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఖాజీ 2 అబ్దుల్ సలాం సాహెబ్ మాట్లాడుతూ మోడీ పాలనను అంతమొందించే విధంగా అందరం ఏకమవ్వాలన్నారు.