Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనకన్నా మెరుగ్గా ఆఫ్రికన్ దేశాలు
- పట్టెడన్నం కోసం పేదలపాట్లు.. వేలకోట్లు పోగేసుకుంటున్న సంపన్నులు
ప్రభుత్వ గోడౌన్లలో ఆహార ధాన్యానికి కొరత లేదు. దేశంలో మాత్రం ఆకలి మంటలు ఇంకా చల్లారలేదు. వీరిలో కొందరు రెండు పూటలా ఎంతో కొంత ఆహారం తీసుకోగలుగుతున్నా, అందులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లేక రక్తహీనతలాంటి సమస్యలతో బాధపడుతున్న దుస్థితి. దీంతో, ఆకలి బాధల్ని కొలిచే ప్రపంచ ఆహార సూచి(జీహెచ్ఐ)లో భారత్ స్థానం 117 దేశాల్లో 102వ స్థానానికి దిగజారింది. ఇదిలా ఉండగా, ఏటా వేల కోట్లు వెనకేసుకునే కార్పొరేట్లకు మాత్రం కేంద్రంలోని మోడీ సర్కార్ పన్ను రాయితీలు కల్పించి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మెప్పు పొందుతోంది. ఓవైపు ఆకలి బాధలతో సతమతమవుతున్న పేదలు, మరోవైపు వేల కోట్ల సంపదతో విలాస జీవితం గడుపుతున్నారు ధనికస్వాములు. ఇదీ నేటి భారతం..
న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం 117 దేశాల్లో భారత్కు 102వ స్థానం అంటే మనకంటే 15 దేశాలు మాత్రమే అధ్వాన్నంగా ఉన్నాయని అర్థం. వాటిలో ఎక్కువ భాగం ఆఫ్రికన్ దేశాలే అన్నది గమనార్హం. ఒకప్పుడు ఇథి యోపియా అంటే ఆకలి చావులకు పెట్టింది పేరు. ఇప్పుడు ఆ దేశం కూడా మనకన్నా మెరుగైన స్థానంలో నిలిచింది. ఆ దేశంలోని చిన్నారులకు మనతో పోలిస్తే పోషకాహారపు లభ్యత మెరుగుపడటమే అందుకు కారణం. అంతేకాదు, నైజీరియా, టాంజానియా, మొజాంబిఖ్, అంగోలా, గ్యూ నియా-బిసావు, నైగర్లాంటి ఆఫ్రికన్ దేశాలు కూడా మన కన్నా మెరుగైన ర్యాంక్ను సాధించాయి. ఇక మన పొరుగు దేశాలైన శ్రీలంక(66), మయన్మార్(69), నేపాల్(73), బంగ్లాదేశ్(88), పాకిస్థాన్(94) మనకన్నా మెరుగైన స్థానా ల్లో నిలిచాయి. జీహెచ్ఐని నాలుగు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు. వీటిలో మూడు అంశాలు పోషకాహా రానికి సంబంధించినవే. అందులో ఒకటి పోషకాహార లోప మున్న పౌరుల శాతం. రెండోది ఐదేండ్లలోపు చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువులేనివారి శాతం. దీనినే వేస్టేజ్గా పరి గణిస్తారు. మూడోది ఐదేండ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేనివారి శాతం. దీనినే స్టంటింగ్ అంటారు. మొత్తమ్మీద పౌష్టికాహార లోపం చూస్తే జీహెచ్ఐలో మెరు గైన ర్యాంకుల్లో ఉన్న పలు దేశాలకన్నా భారత్ పరిస్థితి బాగానే ఉన్నది. భారత్లో పౌష్టికాహారం లోపమున్న పౌరు లు 14.5 శాతం కాగా, బంగ్లాదేశ్లో 14.7 శాతం, పాకిస్థా న్లో 20.3 శాతం, ఇథియోపియాలో 20.6 శాతం, రువాం డాలో 14.5 శాతంగా లెక్క తేల్చారు. స్టంటింగ్ విషయంలో భారత్లోని చిన్నారులు 37.9 శాతం కాగా, బంగ్లాదేశ్లో 36.2 శాతం, ఇథియోపియాలో 38.4 శాతం, రువాండాలో 37.6 శాతంగా లెక్కగట్టారు. ఈ దేశాల్లో ప్రతి 10మంది చిన్నారుల్లో నలుగురు స్టంటెడ్ అని అర్థం. అంటే..వీరికి సరైన పోషకాహారం అందడంలేదని అర్థం. భారత్ ర్యాంక్ దిగజారడానికి కారణం వేస్టింగ్లో అధ్వాన్న స్థితిలో ఉండ టం. వేస్టింగ్ రువాండాలో 2.1 శాతం, ఇథియోపియాలో 7.1 శాతం, పాకిస్థాన్లో 10 శాతం, బంగ్లాదేశ్లో 14.4 శాతం కాగా, భారత్లో 20.8 శాతంగా లెక్కవేశారు. దీంతో, మొత్తమ్మీద భారత్ ర్యాంక్ దిగజారింది. దేశంలోని చిన్నా రులకు పౌష్టికాహారం అందించడంలో పాలకలు కాసింత శ్రద్ధ చూపినా ప్రపంచ యవనికపై మనస్థానం మెరుగ్గా ఉండేది. మనకు ఆహార ధాన్యాల కొరత లేదని పాలకులు పదేపదే చెబుతున్నారు. మరి గోడౌన్లలో మూలుగుతున్న ఆహార ధాన్యమంతా ఎటు పోతోంది..? ఎలుకలు, చెదపురుగుల్ని మేపేందుకు దాచి పెడుతున్నారా..?