Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికమాంద్యం ఎదుర్కోవటంపై కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్
- రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి...
- ఉపాధి హామీ పనులపై నిధుల వ్యయం పెరగాలి..
తిరువనంతపురం : ఆర్థికపరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం ఎంచుకున్న మార్గం సరైంది కాదని కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ అన్నారు. కేవలం కొంతమంది ప్రయివేటు పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధాన నిర్ణయాలు తీసుకున్నారనీ, వారికి పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించారనీ, ఈ చర్యలు మార్కెట్ డిమాండ్ను ఎంతమాత్రమూ పెంచలేవనీ అన్నారు. ఒక ఆర్థికవేత్తగా జీఎస్టీ కౌన్సిల్లో సమాఖ్య వ్యవస్థ ప్రాధానత్యను గట్టిగా వినిపిస్తారన్న పేరు ఆయనకు ఉంది. ఆర్థికమాంద్యం నేపథ్యంలో రాష్ట్రాలు వృద్ధిబాట పట్టడంపై థామస్ ఐజాక్ వెలుబుచ్చిన అభిప్రాయాలు మీడియాలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..''ప్రజల చేతుల్లోకి నగదు వచ్చే మార్గాల్ని అన్వేషించాలి. వాటిని అమలుజే యాలి. డిమాండ్ను పెంచడానికి చేపట్టాల్సిన ముఖ్యమైన చర్య ఇది. ఉదాహరణకు ఉపాధి హామీ చట్టం కింద పనుల్ని రెట్టింపు చేయాలి. నిధుల వ్యయం పెద్ద ఎత్తున జరగాలి. పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ చట్టాన్ని అమలుజేయాలి.
రుణాలు అందుబాటులోకి తీసుకురావాలి. వినియో గదారుల చేతుల్లో నగదు చేరే చర్యల్ని తీసుకోవాలి. ఇవన్నీ కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు. రాష్ట్రాలు చేయలేవు. వాటికి ఎఫ్ఆర్బీఎం పరిమితి పాటించటం అనే అడ్డంకి ఉంది.
అయినా వెనక్కి తగ్గేది లేదు..
ప్రపంచవ్యాప్తంగా 2009లో తీవ్రమైన ఆర్థికమాంద్యం వచ్చిన సంగతి తెలిసిందే. గల్ఫ్లోనూ దీని ప్రభావం పెద్ద ఎత్తున ఉండటం, కేరళ ఆర్థికపరిస్థితిని ప్రభావితం చేసింది. ఇప్పుడు దాదాపు అలాంటి ఆర్థికమాంద్యమే మళ్లీ వచ్చింది. అయితే గతం నుంచి మేం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. సంక్షోభ సమయంలో ప్రాంతీయంగా ప్రత్యేక వ్యూహాలు ఉండాలని గ్రహించాం. కేరళ విషయానికొస్తే, ప్రభుత్వ ఖజానా ఆదాయం 10శాతం పెరిగింది. అలాగే వ్యయం కూడా 15-16శాతం పెరుగుతూ వస్తోంది. విద్య, వైద్యం, సంక్షేమరంగాల్లో ప్రభుత్వ వ్యయం పెరగటమేగానీ, తగ్గకూడదనే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం పనిచేస్తోంది.
రాష్ట్రాలతో కలిసి పనిచేస్తేనే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఆర్థికమాం ద్యంను ఎదుర్కోవచ్చుననీ, కానీ కేంద్రం అలాంటి ప్రయ త్నం చేయటం లేదనీ థామస్ ఐజాక్ అన్నారు. మాంద్యాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం ఏదేదో చేస్తుంది కానీ, అసలు విష యం.. రాష్ట్రాలతో చర్చలు జరపటాన్ని మాత్రం పట్టించుకో వటం లేదని అన్నారు. కేంద్రం చేసే ప్రభుత్వ వ్యయం కన్నా, రాష్ట్రాలు చేసే ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉంటుందన్న విషయం విస్మరిస్తున్నారని అన్నారు. మొత్తం అన్నిరంగాల్లో మాంద్యం ప్రభావం కనపడుతోందనీ, దీనికి కారణం డిమాండ్ లేకపోవటమేనన్నది కూడా అందరికీ తెలిసిన విషయమేననీ అన్నారు. సమస్యకు గల కారణాలు చాలా స్పష్టంగా కనపడుతున్నా, రాష్ట్రాలతో కలిసి పనిచేయాలన్న ఆసక్తి కేంద్రం నుంచి వ్యక్తం కావటం లేదని అన్నారు.