Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది 4.4 లక్షల మంది మరణాలు
- అత్యధికంగా 27శాతం మంది టీబీ రోగులూ మనదేశంలోనే : డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ : మోడీ సర్కారు పాలనలో దేశంలో టీబీ మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారత్లో టీబీని రూపుమాప డమే లక్ష్యమని కేంద్రం తెలుపుతున్నప్పటికీ ఈ సమస్య తీవ్రత నానాటికీ పెరిగిపోతున్నది. దేశంలోని పేదలకు సరైన పౌష్టికా హారం లభించక, వైద్య రంగంపై మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి.. వెరసి నివారించబడిన వ్యాధులు సైతం తిరగదోడుతున్నాయి. టీబీ కారణంగా గతేడాది దేశంలో దాదాపు 4.4 లక్షల మంది చనిపోయారు. అలాగే టీబీ రోగుల సంఖ్య కూడా మనదేశం లోనే అధికంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26 లక్షల మందికి పైగా(27శాతం మంది) రోగులు భారత్లోనే ఉండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసిన 'గ్లోబల్ టీబీ రిపోర్ట్- 2019'లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్కారు పథకాలు, కార్యక్రమాల వైఫల్యంతో పాటు టీబీ బాధితులకు సరైన
చికిత్సను అందించకపోవడం, వ్యాధిని ముందుగానే గుర్తించలేకపోవ డం వంటివి టీబీ సమస్యకు కారణాలుగా డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో తెలిపింది.
74శాతం మందికి చికిత్స అందడంలేదు
ఈ నివేదిక ప్రకారం.. 2017లో భారత్లో 4.1 లక్షల మంది టీబీతో మరణించారు. ఈసంఖ్య 2018లో 4.4 లక్షలుగా నమోదైంది. అయితే ఒక్క ఏడాది వ్యవధిలోనే టీబీ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 30వేలకు పెరగడం గమనార్హం. కాగా, ఈ కాలంలో నమోదైన టీబీ కేసుల సంఖ్య 50వేలు తగ్గింది. అయితే చికిత్స అందకపోవడమే.. టీబీ రోగుల సంఖ్య దేశంలో నానాటికీ పెరిగిపోవడానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. భారత్లో దాదాపు 74శాతం మంది టీబీ రోగులు చికిత్సను పొందలేకపోతున్నారని నివేదిక వివరించింది. ఇక టీబీ రోగులను గుర్తించడంలోనూ కేంద్రం విఫలమవుతున్నది. ప్రభుత్వ టీబీ కార్యక్రమం ద్వారా కూడా టీబీ ఉన్నవారిని గుర్తించడంలేదు. దీంతో వారు తగిన చికిత్సను పొందకపోవడం కారణంగా టీబీ మరణాలు పెరుగుతున్నాయి. టీబీ రోగులకు చికిత్స అందించడంలో సక్సెస్ రేట్ భారత్లో తక్కువగానే ఉన్నది. 30 అధిక టీబీ బాధిత దేశాలతో పోల్చు కుంటే భారత్లో ట్రీట్మెంట్ సక్సెస్ రేటు 50శాతం కంటే తక్కువగా ఉండ టం గమనార్హం. ప్రపంచంలో టీబీ అధికంగా ఉన్న ఎనిమిది దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2018లో భారత్లో అత్యధికంగా 26.9 లక్షల మంది టీబీ రోగులున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచంలోని టీబీ రోగుల సంఖ్యలో ఇది 27శాతం. అయితే మిగిలిన ఏడు దేశాలలో ఇదికేవలం మూడు నుంచి తొమ్మిది శాతంగా ఉండటం గమనార్హం. 2017లో భారత్లో టీబీ రోగుల సంఖ్య 27.4లక్షలుగా ఉన్నది. 2017 లో ప్రతి పదివేల మందిలో 204 టీబీ కేసులు నమోదు కాగా, 2018లో అది 199గా ఉన్నది. 2013-18 మధ్య భారత్లో కొత్త టీబీ కేసులు 12 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగినట్టు(దాదాపు 60శాతం) డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. దేశంలోని టీబీ రోగులకు అందే అరకొర ఆర్థిక సహాయాన్ని సైతం మోడీ సర్కారు ఇటీవలే నిలిపివేసిన విషయం తెలిసిందే.