Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ముంబయిలోని ఆరే కాలనీలో చెట్లను నరికివేయడంపై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు సోమ వారం స్పష్టం చేసింది. నెల 7న సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఆరే కాలనీలో చెట్లను నరికివేయడం లేదని, యథాతథస్థితిని కొనసాగిస్తున్నామని బ్రిహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బిఎంసి) తరుఫున హాజరైన సొలిసి టర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి చెప్పారు. ఇదే విషయాన్ని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి పునరుద్ఘాటించారు. మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు నిర్మాణం తప్ప ఇతర భవన నిర్మాణాలు జరగడం లేదని, మెట్రో సర్వీస్ వల్ల వాయు కాలుష్యం తగ్గిందని అన్నారు. వాదనలు విన్న అనంతరం మెట్రో ప్రాజెక్టుపై స్టే విధించలేదని, చెట్లను నరికివేయడం నిలుపుదల చేయాలని మాత్రమే ఆదేశించామని జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం తెలిపింది. ఆరేకాలనీలోని చెట్ల పెంపకం, నరికివేతకు సంబంధించిన చిత్రాలతో కూడిన తాజా నివేదికను సమర్పించాలని బిఎంసిని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది.