Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు కార్మికులు మ్యాన్హోల్లో పడి చనిపోయారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. సుహల్ పలాస్, సుఖ్రం మోహానియా అనే యువకులు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ)లో కాంట్రాక్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. తాగునీటి కోసం.. ఏఎంసీ అండర్ గ్రౌండ్ పైపు లైన్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా విశాలా సర్కిల్ సమీపంలో పనులు చేపట్టింది. ఈ క్రమంలోనే సుహల్, సుఖ్రంలు ప్రమాదవశాత్తు 15 అడుగుల లోతైన మ్యాన్హోల్ పడిపోయారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన తోటి కార్మికులు వారిని వెలికితీసి, సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో చిక్సిత పొందుతూ మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కాంట్రాక్టర్లకు, మున్సిపాలిటీ అధికారులకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. భద్రతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.