Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: 'కొత్త మోటారు వాహన చట్టం'లో ఎలాంటి మార్పులూ చేయబోమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించితే జరిమానా విధింపులను ఆయా రాష్ట్రాల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం జరిమానా విధింపులపై అన్ని రాష్ట్రాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇప్పటి వరకూ ఆయా రాష్ట్రల పరిస్థితులకు అనుగుణంగా జరిమానాలను తగ్గించి ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. వాటిల్లో గుజరాత్, ఉత్తరాఖండ్, కేరళ, కర్నాటక, అసోం రాష్ట్రాలున్నాయి. కాగా, 'ప్రతీఏటా దాదాపు 5లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ, ఈ ఘటనల్లో 1.5లక్షల మందికి పైగా చనిపోతున్నార'ని గడ్కరీ తెలిపారు. 2.5లక్షల మంది వికలాంగులవుతున్నారని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలను తగ్గించడానికే కేంద్ర ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.