Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్కు జమ్మూకాశ్మీర్ గవర్నర్ హెచ్చరిక
శ్రీనగర్ : పాకిస్థాన్కు జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరికలు పంపారు. తీరు మార్చుకోకపోతే ఆదివారంనాడు జరిగిన ఆర్టిలరీ స్ట్రైక్స్(ఫిరంగిదాడులు) పునరావృతమవుతాయని పాక్నుద్దేశిస్తూ అన్నారు. ''నవంబర్ 1 నుంచి కొత్త కాశ్మీర్ ఉంటుంది. ఇన్నాళ్లు రోమింగ్ చేసిన ఇక్కడి యువత ఏమి సాధించారు? రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే అంశంలో యువత భాగస్వామ్యం కావాలి'' అని గవర్నర్ తెలిపారు. '' పాకిస్థాన్ తన తీరును మార్చుకోవాలి. లేదంటే ఇలాంటి దాడులను మేము మళ్లీ చేస్తాం. పాక్ లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర క్యాంప్లను ధ్వంసం చేస్తాం'' అని ఆయన అన్నారు. కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరిస్తే ఆ సౌకర్యాన్ని ఉగ్రవాదులే ఎక్కువగా వినియోగించుకొనే అవకాశం ఉన్నదని సత్యపాల్ మాలిక్ తెలిపారు.