Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 జిల్లాలకు రెడ్ అలర్ట్
తిరువనంతపురం: కేరళలో ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా 7 జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ను ప్రకటించింది. తిరువనంతపురం, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కడ్లలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. కొచ్చితో పాటు పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో 12 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. పలుచోట్ల రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. ఉపఎన్నికలు జరుతుగుండటంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు. అత్యవసర వస్తు సామగ్రిని అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్ అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కర్నాటకలోనూ జలవిలయం !
భారీ వర్షాలు కర్నాటకనూ ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షాలతో ధార్వాడ్, బెలగావి, కలబురిగి, గడగ్, విజయపుర, బాగల్కోట్, శివమొగ్గ, చిక్మంగళూరు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాపూర్లో మూడు ఇండ్లు నెలకూలాయి. వందల సంఖ్యలో ఇండ్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇంటి పైకప్పు భాగంలో ఆశ్రయం పొందడం ఆందోళనకరంగా ఉన్నది. వరదనీరు ముంచెత్తడంతో.. 4వ నెంబర్ జాతీయ రహదారితోపాటు పలు మార్గాలను అధికారులు మూసివేశారు. సుతగట్టి ఘాట్కి రెండు వైపులా వందలాది వాహనాలు చిక్కుకున్నాయి. ఘటప్రభ నది ఉధృతంగా ప్రవహిస్తూ బెలగావిని ముంచెత్తింది. నేడు,రేపు కేరళ, కర్నాటకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.