Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్
న్యూఢిల్లీ : వ్యవసాయ వృద్ధిరేటు.. భారత్కు కొత్త వృద్ధి రేటుగా ఉండాలని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు ప్రభాత్ పట్నాయక్ సూచించారు. ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిట ీ(జేఎన్యూ)లో ఏర్పాటు చేసిన ' థియరీ, ప్లానింగ్, భారత్ అభివృద్ధిలో సవాళ్లు' పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభాత్ పట్నాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజాన్ని అందించడం కోసం 'కొత్త పద్దతి'కి ఆయన పిలుపునిచ్చారు. ''జీడీపీ, ఇతర పద్దతుల కంటే.. వ్యవసాయ వృద్ధిరేటు.. భారత్కు కొత్త వృద్ధిరేటుగా ఉండాలి'' అని ఈ సందర్భంగా ప్రభాత్ పట్నాయక్ సూచించారు. ''తయారీ అనేది డిమాండ్ పరిమిత రంగం. వ్యవసాయం విస్తృత ఉత్పతి పరిమిత రంగం. కాబట్టి, ఇప్పటి నుంచి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి'' అని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఐదేండ్ల నుంచి కేంద్రంలో మోడీ సర్కారు అస్తవ్యస్థ ఆర్థిక విధానాలను అవలంభిస్తోందనీ.. జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగానే దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రమైందని పలువురు వక్తలు తెలిపారు.