Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న 8 వేల మంది కార్మికులు
తిరువనంతపురం : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు కేరళ ఆర్టీసీ కార్మికులు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని 78 ప్రదేశాల్లో సుమారు 8 వేల మంది కార్మికులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (కేఎస్ఆర్టీఏఏ), బస్ ఫెడరేషన్, గూడ్స్ లారీ వర్కర్స్, లైట్ మోటార్ వెహికిల్స్ వర్కర్స్, డ్రైవింగ్ స్కూల్ వర్కర్స్, తదితరులు ర్యాలీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వారు నినాదాలు చేశారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.