Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్పై ఎన్జీటీ నిర్ణయం
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుమతులను సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యూన ల్లో దాఖలైన మధ్యంతర పిటి షన్పై విచారణను ఎన్జీటీ మరోసారి వాయిదా వేసినట్టు ప్రకటించింది. మధ్యంతర పిటిషన్ కేసు ఎన్జీటీ రిజిస్ట్రీలో నమోదైనా, సాంకేతిక కారణాలతో ధర్మాసనంలోని న్యాయమూర్తులకు సరైన సమయంలో అందలేదు. ఈ నేపథ్యంలో జస్టిస్ రఘువేంద్ర ఎస్. రాథోడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను ఈ నెల 30 కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని హయాతుద్దీన్ గతంలో ఎన్జీటీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, విచారణ సమయంలోనే ప్రాజెక్ట్ అనుమతులు వచ్చినా, అనుమతులు ఇవ్వడంలో కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలు పాటించలేదని హయాతుద్దీన్ ఎన్జీటీలో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సెప్టెంబర్ 27 ఎన్జీటీ ధర్మాసనం విచారించింది. అయితే, ప్రధాన పిటిషన్లో ప్రస్తావించిన అంశాలే, మధ్యంతర పిటిషన్ లో ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయ పడింది. అందువల్ల పర్యావరణ అనుమతులపై ఉన్న అభ్యంతరాలను పేర్కొంటూ మరో పిటిషన్ దాఖలు చేయాలని విచారణలో ధర్మాసనం సూచించింది.