Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నూలులో విజయవంతంగా కార్యక్రమం
కర్నూలు : రుచికరమైన అల్పాహారం తయారీకి విజయలక్ష్మీ డీర్ మినపగుళ్లను వినియోగిస్తున్నారని విజయలక్ష్మీ డీర్ మినపగుళ్ల కంపెనీ యాజమాన్యం తెలిపింది. మార్కెట్లోకి వచ్చి 30 ఏండ్లు గడిచిన సందర్భంగా ఆదివారం కర్నూలు పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ గుడివాడ సంపత్ కుమార్ మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా నాణ్యమైన మినపగుళ్లను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను విజయలక్ష్మీ డీర్ మినపగుళ్లు చూరగొందని అన్నారు. ఈ వేడుకల్లో విజయలక్ష్మీ డీర్ మినపగుళ్ల కంపెనీ ప్రాసెసింగ్ మేనేజర్ గుడివాడ హరినాథ్, డైరెక్టర్ గుడివాడ బాలకృష్ణ, కట్టరాజు(సతీశ్ కుమార్), జ్యోతి డిపార్ట్మెంట్ స్టోర్ యజమాని విశాల్, బషీర్ అహ్మద్, హౌల్సేల్ మండి మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్, కార్యదర్శి వేముల రమేశ్ బాబు, కోశాధికారి జెవి సత్యనారాయణ, కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల లక్ష్మీనారాయణ, కార్యదర్శి వేముల రమేశ్, కోశాధికారి మారం చెన్నయ్య, శ్రీవాసవి మహిళా మండలి అధ్యక్షురాలు ఇ రాజ్యలక్ష్మి, కార్యదర్శి బి పద్మజ తదితరులు పాల్గొన్నారు.