Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖండించిన పౌర హక్కుల కార్యకర్తలు
రాంచీ : మానవ హక్కుల కార్యకర్త, క్యాథలిక్ మత గురువు స్టన్ స్వామికి చెందిన వస్తువులను జార్ఖండ్ పోలీసులు అటాచ్ చేశారు. దేశద్రోహం కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరుకావడం లేదనే ఆరోపణతో పోలీసులు ఆయనకు చెందిన రెండు టేబుళ్లు, మూడు కుర్చీలు, ఒక కప్బోర్డ్తో పాటు స్టన్ స్వామి ఇంట్లో ఉన్న మరిన్ని వస్తువులను పట్టుకెళ్లారు. గతేడాది జార్ఖండ్లో ఉధృతంగా సాగిన పత్తల్గడి ఉద్యమంలో భాగంగా ఫేస్బుక్లో చేసిన పోస్టుల ఆధారంగా పోలీసులు ఆయనతో పాటు మరో 18 మంది హక్కుల కార్యకర్తల మీద దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్టన్ స్వామి ఆస్తులను అటాచ్ చేయడాన్ని జార్ఖండ్ జనాధికార్ మహాసభ (జేజేఎం)తో పాటు పలువురు పౌర హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న మేధావులు, హక్కుల కార్యకర్తలను వివిధ కేసుల్లో ఇరికించి చిత్రహింసలకు గురిచేస్తున్నారనీ, ఇది అన్యాయమని వారు ఆరోపించారు. ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని జేజేఎం డిమాండ్ చేసింది.