Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లందరినీ ఒకేలా పరిగణించలేమనీ, విజరు మాల్యా సహా పలువురు దేశం విడిచిపారిపోయినంత మాత్రానా అందరూ అలాగే ఉంటారని భావిం చలేమని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఐఎన్ఎక్స్ కేసులో నిందితుడిగా ఉన్న చిదంబ రం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఈ సంద ర్భంగా జరిగిన వాదనలో.. చిదంబరం బెయిల్ను వ్యతిరేకిస్తూ.. ఆర్థిక నేరస్థులు విదే శాలకు పారిపోవడాన్ని జాతీయ దృగ్విషయంగా చూడాలని సొలిసిటర్ జనరల్ తు షార్ మెహతా కోరారు. అయితే వాదనను అంగీకరించలేమని జస్టిస్ ఆర్ బాను మతి నేతత్వంలోని ధర్మాసనం తెలిపింది. నిందితుడు దేశం విడిచి పారిపోతారనే అంశాన్ని వ్యక్తిగత ప్రాతిపదికన పరిగణించాలని పేర్కొంది. అర్హత ఉన్నవారికి బెయిల్ ఇవ్వా ల్సిందేనని వెల్లడించింది. చిదంబరానికి విధించిన షరతుల దృష్ట్యా ఆయన విచా రణ నుంచి తప్పించుకునే అవకాశం లేదనీ, దేశం విడిచి పారిపోరని ధర్మాసనం తెలిపింది.