Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ టపాసులతో పోలిస్తే30 శాతం కర్భన ఉద్గారాలు తక్కువ
న్యూఢిల్లీ : పర్యావరణానికి హాని చేస్తున్న టపాసులపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో మార్కెట్లోకి హరిత టపాసులు (గ్రీన్ క్రాకర్లు) రాబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, శాస్త్ర సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలో మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించని టపాసులను తయారుచేశామని తెలిపారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ) శాస్త్రవేత్తల కృషితో ఇవి తయారయ్యాయని చెప్పారు. సాధారణ టపాసులతో పోలిస్తే గ్రీన్ క్రాకర్లలో కర్భన ఉద్గారాలు 30 శాతం తక్కువనీ, అంతేగాక ఇవి 'ఎకో ఫ్రెండ్లీ' అని ఆయన వివరించారు. ఇందులో విష రసాయనాలేమీ వాడలేదనీ, అన్ని ప్యాకెట్ల మీద గ్రీన్ లోగో (క్యూ ఆర్ కోడ్) ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తి చేసిన మీదటే వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని అన్నారు. గ్రీన్ క్రాకర్లను తయారేచేసే కాంట్రాక్టు కూడా ది పెట్రోలియం అండ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసొ) నిబంధనల మేరకు కొన్ని సంస్థలకే ఇచ్చామని హర్షవర్ధన్ తెలిపారు.