Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో 25 ఏండ్లుగా నానుతూ వస్తోన్న భూపరిహార సమ స్యపై మీరట్ జిల్లా రైతులు కదంతొక్కారు. భార తీయ కిసాన్ సంఫ్ు యూనియన్(బీకేయూ) ఆధ్వ ర్యంలో అన్నదాతలు నిరసనలకు దిగారు. తమ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న శతాబ్దినగర్ ప్లాట్ల విషయంలో తమకు బకాయిపడిన చెల్లింపు లను తక్షణమే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ తమ డిమాండ్లను పరిష్కరించ కపోతే ఢిల్లీ-మీరట్ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో యూపీ ప్రభు త్వం తగిన రీతిలో వ్యవహరించడంలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతన్నలకు చెందిన 1620 ఎకరాలకు గానూ.. వెయ్యి ఎకరాల భూమిని 1987లో మీరట్ డెవలప్మెంట్ అథారిటీ(ఎండీఏ) స్వాధీ నం చేసుకున్నది. తీసుకున్న భూమికి తక్కువ పరిహారాన్ని ఎండీఏ చెల్లిస్తున్నదని ఆరోపిస్తూ మిగిలిన 620 ఎకరాల భూమిని రైతులు స్వాధీ నం చేసుకోనీయలేదు. నిబంధనలకు అనుగుణం గా ఎండీఏ తమకు బకాయిలను చెల్లించడం లేదంటూ అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ''1987లో ఐదు గ్రామాల నుంచి భూమిని ఎండీఏ మా నుంచి స్వాధీనం చేసుకున్నది. ఆ తర్వాత భూమికి చాలా తక్కువ పరిహారాన్ని నిర్ణ యించారు. దీంతో 2000లో ఎండీఏ, యంత్రాం గానికి వ్యతిరేకంగా మేం ఆందోళన చేపట్టాం. చివరకు గజానికి రూ. 690గా నిర్ణయించారు. భూమిని స్వాధీనం చేసుకోనీయకపోతే.. ఆ భూమిని కేవలం నివాసామోదయోగ్యమైన భూమిగా మారుస్తామని మమ్మల్ని అధికారులు బెదిరించారు. ఆ తర్వాత గజానికి రూ. 480 మాత్రమే చెల్లించిన అధికారులు.. మిగిలిన మొత్తాన్ని భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత ముట్టజెప్పుతామన్నారు.