Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జాతీయ ఉర్దూ యూనివర్సిటీ 'జామియా మిలి యా ఇస్లామియా' యాజమాన్యం ఐదుగురు విద్యార్థులకు షోకా జ్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసన ఎని మిదో రోజుకు చేరుకుంది. అయినా వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి స్పందనా లేదని విద్యార్థులు తెలిపారు. కాగా, వర్సిట ీలో మూడు రోజుల పాటు జరిగే ఓ కార్యక్రమానికి ఇజ్రాయిల్ నుంచి ఓ ప్రతినిధి ముఖ్యఅతిథిగా పిలవాలని ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న అర్కిటెక్చర్, ఎకిస్టిక్స్ ఫ్యాకల్టీ నిర్ణయించింది. అ యితే ఇజ్రాయిల్ దేశం పాలస్తినీయన్లపై పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నదనీ, అందువల్ల వారిని ఆహ్వానించడం సరైనది కాదని వారు వెల్లడించారు. ఈ నిర్ణ యా నికి వ్యతిరేకంగా ఈ నెల 5న విద్యార్థులంతా వర్సిటీ ప్రాం గణం లోని అన్సారీ ఆడిటోరియం వెలుపల శాంతియుత నిరసన చేప ట్టారు. ఈ నిరసనలో సెక్యూరిటీగార్డులు కలుగ జేసుకుని విద్యా ర్థులపై దాడిచేసినట్టు నిరసనకారులు ఆరోపిం చారు. దీం తో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తమపై చేయి చేసు కున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేస్తూ ప్రోక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కానీ ప్రోక్టర్ కార్యాల యం అనూహ్యంగా, దాడిచేసిన వారిని వదిలేసి విద్యా ర్థులపైనే చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీన్ని వర్సి టీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. షోకాజ్ నోటీ సులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షోకాజ్ నోటీసులను వెనక్కి తీసు కోకపోతే వైస్ ఛాన్సలర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నట్టు వెల్లడించారు.