Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్లో బ్లాక్ లెవల్ ఎన్నికలపై రాష్ట్రపతికి ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ : కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలను పోస్ట్పోన్ చేయాలని 260 మంది ప్రముఖులు రాష్ట్రపతికి లేఖ రాశారు. లేఖ మీద సంతకర చేసిన వారిలో ప్రొఫెసర్ అయేషా కిద్వారు, జాన్ డ్రీజ్, నందిని సుందర్, మానవ హక్కుల కార్యకర్తలు బెజవాడ విల్సన్, హర్ష మందర్, జర్నలిస్టులు పి.సాయినాథ్, పరంజొరు గుహ ఉన్నారు. 'ప్రజాస్వామ్యంలో నిర్బంధంగా ఎన్నికల నిర్వహణ తగదు. అవి స్వేచ్ఛా వాతావరణంలో జరగాలి. పౌరులు అప్పుడే భయం లేకుండా తమకు నచ్చిన వారికి ఓటేస్తార'ని లేఖలో పేర్కొన్నారు.
కానీ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదని వారు తెలిపారు. రాజకీయ పార్టీలు, నాయకులు, హక్కుల కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలను పోస్ట్పోన్ చేయాలని వారు కోరారు. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 24న కాశ్మీర్లో బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.