Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు ఉగ్రవాదులు హతం
పుల్వామా: జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన రాజ్పురాలో మంగళవారం చోటుచేసుకుంది. పక్కా సమాచారంతో ఆపరేషన్ ప్రారంభించిన భారత ఆర్మీ.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, పూంచ్ జిల్లాలోని బాలకోట్, మెందర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడినట్టు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.