Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎంసీ బ్యాంకు కుంభకోణంపై కేంద్రానికి బాధ్యత లేదా?: ఏచూరి ప్రశ్న
న్యూఢిల్లీ : పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంకు(పీఎంసీ) కుంభకోణంపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు చనిపోతున్నా పట్టించుకోరా? కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. బ్యాంకు అవినీతి కుంభకోణంలో చిక్కుకోవటంతో అందులో డబ్బు దాచుకున్న, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులు తీవ్రం గా ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు మోసాన్ని తట్టు కోలేక ఎంతోమంది గుండెపోటుతో హాస్పిటల్ పాల య్యారు. ఆరోగ్య పరిస్థితి విషమించి నలుగురు వ్యక్తులు చనిపోయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు పీఎంసీ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరు గుతోంది. పీఎంసీ కుంభకోణంపై ఏచూరి ఏమన్నా రం టే...''బ్యాంకులో జరిగిన మోసం, అవినీతి కారణంగా సాధారణ ఖాతాదారులు బలవుతున్నారు. బ్యాంకు ఖాతా దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇవ్వాలి కదా! ఓ వైపు బ్యాంకు మోసాల్ని అడ్డుకో లేరు. మరోవైపు అత్యంత ధనికులకు, పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు ఇస్తారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతినే విధానాలు అమలుజేస్తున్నారు. వాటి దుష్ఫలితాల్ని సామాన్య ఖాతాదారులు అనుభవిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఖాతాదారులకు ఉపశమనం కలిగించే చర్య ఎందుకు చేపట్టడం లేదు?'' అని అన్నారు.
గుండెపోటుతో మహిళ మృతి
పీఎంసీ బ్యాంకు మోసం కారణంగా మరో మహిళ గుండెపోటుతో మరణించారు. మహారా ష్ట్రలోని షోలా పూర్కు చెందిన భారతి సదరంగాని (73) అల్లుడు పీఎంసీ బ్యాంకులో కొంత డబ్బు డిపా జిట్ చేశాడు. బ్యాంకులో మోసం జరిగిందని భారతికి ఆమె కూతురు ఫోన్ ద్వారా తెలియజేసింది. ఈ వార్త తట్టుకోలేక ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చిం దనీ, తీవ్ర మనోవేదనకు గురికా వటంతో ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇది చాలా పెద్ద కుంభకోణం
మోడీ సర్కార్ ఆర్థిక విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని సీతారాం ఏచూరి అన్నారు. దీని ఫలితం కోట్లాది మంది ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజలపై పన్నులు వేసి వసూలు చేసినదాంతో స్వంత ఇమేజ్ పెంచుకోవటానికి, ప్రచార కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. తమకు అత్యంత ఆప్తులు అనే కార్పొరేట్లకు పన్ను మినహాయింపులతో లబ్ది పొందేట్టు చేస్తున్నారు. పీఎంసీ బ్యాంకు మోసమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇది చాలా పెద్ద అవినీతి కుంభకోణమని ఏచూరి అన్నారు.