Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్వని కంటే ఐదింతలు వేగంగా..
- డీఆర్డీఓ దృష్టి
న్యూఢిల్లీ : హైపర్సోనిక్ యుద్ధవిమానం తదుపరి జనరేషన్పై భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) దృష్టిపెట్టింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగలిగే సామర్థ్యమున్న హైపర్సోనిక్ మిసైల్ను తయారు చేయడంపై డీఆర్డీఓ నిమగమైంది. అంటే తదుపరి రకం మిసైల్ సెకన్కు దాదాపు ఒక మైలు దూరం వేగంతో ప్రయాణించనున్నదన్నమాట. ప్రస్తుతం దీనిపై పనులు కొనసాగుతున్నాయి. మిసైల్ను ఉనికిలోకి తెచ్చేముందు పరీక్షించబోయే గాలి సొరంగం(విండ్ టన్నెల్) పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని సీనియర్ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ టన్నెల్ సౌకర్యాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. త్వరలో ప్రారంభిస్తారని రక్షణశాఖ వర్గాల సమాచారం.