Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధరామయ్యను నిలదీసిన వృద్ధురాలు
బెంగళూరు : ఎన్నికలకుదు తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని ఓ వృద్ధురాలు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిలదీసింది. తన నియోజకవర్గం (బాదామి)లో ఇటీవల కురిసిన వర్షాలతో భారీగా వరదలు రాగా.. బుధవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. పర్యటన ముగించుకుని వస్తున్న తరుణంలో అక్కడకు వచ్చిన ఓ వృద్ధురాలు ఆయన కారును ఆపి.. 'మీకు ఓట్లేస్తే మాకు ఇండ్లు కట్టిస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. మా ఓట్లు పొందారు. కానీ మా ఇండ్లు ఇంకా రాలేదు. మాకు ఇండ్లను ఎవరు కట్టిస్తారు..?' అని ప్రశ్నించింది. అయితే సమాధానం చెప్పాల్సిన మాజీ సీఎం.. ఆమెపై అసహనం వ్యక్తం చేస్తూ 'పక్కకు తప్పుకో'మని చేతులతో సైగ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. సిద్ధరామయ్య గతంలోనూ తన వ్యవహారశైలితో పలుమార్లు వార్తల్లో నిలిచిన విషయం విదితమే.