Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ సీఎం నితీష్ కుమార్ మద్దతు
పాట్నా : ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలనే ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ డిమాండ్కు బీహార్ సీఎం నితీష్ కుమార్ మద్దతు ప్రకటించారు. దేశరాజధానిలోని బదర్పూర్ ప్రాంతంలో బుధవారం జరిగిన ర్యాలీలో నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జేడీయూ పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని అన్నారు. అలాగే బీహర్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ను పునరుద్ఘాటించారు.