Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నాయకుడు డి.కె. శివకుమార్కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు రూ.25లక్షల పూచీకత్తుతో శివకుమార్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు బుధవారం వెల్లడించింది. అనుమతి లేనిదే విదేశాలకు వెళ్లరాదని ఆదేశించింది. కాగా, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్(ఈడీ) సెప్టెంబర్ 3న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.