Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : త్రిపుర సీపీఐ(ఎం) సీనియర్ నేత బాదల్ చౌదరి అరెస్టును పార్టీ పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. అగర్తలలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్న బాదల్ చౌదరి కొన్ని ప్రాజెక్టుల అనుమతుల్లో మోసా నికి పాల్పడినట్టు బీజేపీ ప్రభుత్వం బూటకపు కేసులు నమోదు చేసింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఇతర ఉన్నతాధికారుల పేర్లను నమోదు చేసింది. నిరాధారమైన ఆరోపణలతో సీపీఐ(ఎం) నేతలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతు న్నదనడానికి ఇదే నిదర్శనమని పొలిట్బ్యూరో వ్యాఖ్యానించింది.