Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓబీసీ ఉత్తర్వులపై సందేహాల నివృత్తికి..
న్యూఢిల్లీ : ఇతర వెనకబడిన తరగతుల (ఓబీసీ) ఉత్తర్వులపై నెలకొన్న సందేహాల నివృత్తికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు జస్టిస్ రోహిణి కమిషన్ అన్ని రాష్ట్రాలకు ఆహ్వానం పంపింది. ఓబీసీ కులాలలో ఉపకులాల వర్గీకరణ, వ్యవహారిక భాషలకు సంబంధించి కేంద్ర ఉత్తర్వుల్లో సరైన సమాచారం పొందుపరచలేదని పలు రాష్ట్రాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
దీనిపై ఏర్పాటు చేసిన రోహిణి కమిషన్ ఇప్పటికే పలు దఫాలు చర్చలు కొనసాగించింది. కాగా ఆ కమిషన్ గడువు వచ్చే జనవరి 31తో ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.