Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ కంటే కెనడాలోనే సిక్కు ఎంపీలు ఎక్కువ
న్యూఢిల్లీ : భారత్తో పాటు కెనడాలోనూ సమాంతరంగా ఉన్న సిక్కులు.. రెండ్రోజుల క్రితం అక్కడ ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లోనూ గణనీయమైన సీట్లు పొందారు. ఇరుదేశాల్లోనూ సిక్కుల జనాభా రెండు శాతం ఉన్నది. భారత్లో ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సిక్కులు 13 సీట్లు గెలువగా.. కెనడాలో 18 మంది సిక్కు ఎంపీలు విజయకేతనం ఎగురవేశారు. గెలుపొందినవారిలో ఒంటారియో ప్రావిన్సు నుంచి పది మంది, బ్రిటిష్ కొలంబియాలో నలుగురు, అల్బెర్టలో ముగ్గురు, క్యూబెక్ నుంచి ఒక్కరు ఉన్నారు.