Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్ రాజకీయ నాయకులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడనీయకుండా తమ గొంతు నొక్కే విధంగా పలు షరతులతో కూడిన బాండ్పై సంతకం చెయ్యబోమని నిర్బంధంలో ఉన్న అక్కడి పలు రాజ కీయ పార్టీల నాయ కులు అంటున్నారు. కాశ్మీర్లో నిర్బంధంలో ఉన్న పలు వురు నాయకులు, కార్యకర్తల విడుదల కావాలంటే వారంతా ఒక బాండ్పై సంతకం చెయ్యాల్సి ఉంటుంది. ఆర్టికల్ 370తో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఏడాది పాటు ఎలాంటి ప్రసంగాలూ, సమావేశాలు ఏర్పా టు చేయబోమనీ బాండ్లో షరతులు ఉన్నాయి. షరతు లను ఉల్లంఘించకుండా బాండ్పై సంతకం చేసే వ్యక్తి రూ.10వేలు, రూ.40వేలను ష్యూరిటీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బాండ్పై సంతకం చేయడానికి కాశ్మీర్లోని పీడీపీ, ఎన్సీ వంటి పలు ప్రాం తీయ పార్టీల అధినాయకత్వాలు నిరాకరిస్తున్నాయి. ''నిర్బంధాల నుంచి విడుదల కోసం బాండ్పై సంతకం చేయాల్సిందింగా సంబంధిత యంత్రాంగం పలువురు రాజకీయ నాయకులను ఆశ్రయించింది. అయితే వారం తా బాండ్పై సంతకం చేయడానికి నిరాకరించారు'' అని ఇటీవల విడుదలైన పీడీపీ కార్యకర్త ఒకరు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనపై మోడీ సర్కారు ఏక పక్ష నిర్ణయం అనంతరం రెండునెలలకు పైగా జమ్మూ కాశ్మీర్లో రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు, పౌరసంఘాల నాయకుల నిర్బంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.