Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : ఏపి ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజధాని ప్రాంత గ్రామాల్లో అఖిలపక్షం నిర్వహించిన సమ్మె ప్రశాంతంగా ముగిసింది. ఉండవల్లి సెంటర్లో సిపిఎంతో పాటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం ప్రదర్శన నిర్వహించారు. స్థానికులు, వ్యాపారవేత్తలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దుకాణాలు, కార్యాలయాలు మూసివేశారు. నిడమర్రు, పెనుమాక, ఎర్రబాలెం గ్రామాల్లోనూ బంద్ సంపూ ర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ఏపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ ప్రభుత్వ మెడలు వంచైనా రైతుల హక్కులు కాపా డేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం టిడిపి సొంత వ్యవహారం కాదని, రైతులను కలుపుకొని పోవాలని తెలిపారు. ఇష్టముంటేనే పొలాలు తీసు కుంటామని చెప్పి ఇళ్లు, పొలాలు బలవంతంగా లాక్కుంటున్నారని పేర్కొన్నారు. గ్రామాలను తరలించే కుట్రలకు సైతం పాల్పడుతున్నారని, ఇంతవరకు గ్రామకంఠాల సమస్య తేల్చనే లేదని వివరించారు. పవన్కళ్యాణ్ కూడా భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే సహించబోమని హెచ్చరించారు.