Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వదని తెలిసిన ప్పుడు కేంద్రానికి ఎందుకు మద్దతు కొనసాగిస్తున్నారో చంద్ర బాబు చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. సిఎం గానీ ఆయన మంత్రులుగానీ కేంద్రం నుంచి ఎందుకు తప్పుకోవడం లేదన్నారు. పార్ల మెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి బిజెపి, టిడిపిలు మద్దతు పలికాయ న్నా టరు. ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మ హత్యాయత్నం చేసిన సుబ్బారావును ఆస్పత్రిలో జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసు నుంచి సిఎం బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎపికి ప్రత్యేక ప్యాకేజీ లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన అప్పుడు చెప్పిందేమిటి ఇప్పుడు చేసేదేమిటని ప్రశ్నించారు. సిఎం మంగళవారం కేంద్ర పెద్దలను కలిసినా ప్రత్యేక హోదాపై ఎవరూ మాట్లాడక పోవడాన్ని జగన్ తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్నవాటిని అమలు చేస్తామని మాత్రమే చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ నెల 29న జరిగే బంద్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. కనీసం బంద్ను చూపించైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని సిఎంకి సూచించారు.