Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : 'జమిలి ఎన్నికలు' లేదా 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అనేవి ఇప్పటికిప్పుడే సాధ్యంకాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలన్నీ కూర్చొని చర్చించి, ఏకాభిప్రాయం సాధించడంతో పాటు ఇప్పుడున్న చట్టంలో కొన్ని సవరణలు తెస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. ఇది అధికారిక ప్రకటన కాదని, తాము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని అరోరా అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో 1967 వరకు జమిలి ఎన్నికల కోసం జరిగాయని, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కాల పరిమితి కంటే ముందే రద్దు కావడం, తదితర కారణాలతో అది సాధ్యం కాలేదని అన్నారు. ఈవీఎంలపై పలువురి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ను టాంపరింగ్ చేయలేమని అరోరా స్పష్టం చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ప్రముఖ నిపుణులు రూపొందిస్తారని, అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయిస్తుండటం బాధాకరమని ఆయన అన్నారు. 2014లో జరిగిన లోక్సభ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. సమాజంలో ఇతరులతో పోలిస్తే ఆర్థికంగా వెనుకబడిన తరగతి చెందిన వారు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని అన్నారు.