Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఏపీలో జాతీయ మహాసభ
- రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ
రాజమహేంద్రవరం: ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 9వ జాతీయ మహాసభ ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రివర్బేలో జరుగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానుండటంతో అంగన్వాడీల్లో ఉత్సాహం పొంగి పొర్లుతున్నది. మహాసభ వేదిక, బహిరంగ సభ వేదిక సిద్దమయ్యాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ మహాసభలో అనేక తీర్మానాలను ఆమోదించడంతోపాటు నూతన జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. నాయకులు సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. సభలకు హాజరయ్యే నాయకులు, ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మహాసభలకు రాజ మహేంద్రవరం నగరం ముస్తాబైంది. ఎఐఎఫ్ఎడబ్ల్యూ హెచ్, సీఐటీయూ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఈ సభలకు హాజరు కానున్నారు. ఈ మహాసభలకు దేశం నలుమూలల నుంచి 800 మంది ప్రతినిధులు సౌహార్ధ ప్రతినిధులు, సీఐటీయూ అఖిల భారత నాయకులు హాజరు కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ జరుగనున్నది. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్సేన్, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఎఐఎఫ్ఎడబ్ల్యుహెచ్ అఖిల భారత అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధు, సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ నరసింగరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎ.గఫూర్, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, ఎడబ్ల్యూడబ్ల్యూహెచ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సీఐటీయూ రాజమహేంద్రవరం జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.మూర్తి ప్రసంగిం చనున్నారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే బైక్ ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, గోడపత్రికలు, జెండా ఆవిష్కరణలు, హోర్డింగ్స్, సాంస్కృతిక ప్రదర్శలు నిర్వహించా రు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ సెంటరులో కళాజాతాను ఎఐఎఫ్ఎడబ్ల్యుహెచ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎఆర్.సింధు శనివారం ఉదయం ప్రారంభించారు. సాయంత్రం ఆరు గంటలకు పుష్కరఘాట్లో ప్రజా సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రజానాట్యమండలి కళాకారులు తమ కళారూపాల ద్వారా మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను చైతన్యం చేశారు.