Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 1.51 లక్షల మందికి పైగా మృతి
- యూపీలో అధికం.. రెండో స్థానంలో మహారాష్ట్ర
- కేంద్రం తాజా సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య అదే తీరులో ఉంటున్నది. రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో గతేడాది 1.51 లక్షల మందికి పైగా మరణించారు. ఈ ప్రమాద మరణాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, మహారాష్ట్రలు ముందు వరుసలో ఉన్నాయి. 2018లో దేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రితత్వశాఖ తాజాగా పొందుపర్చిన సమాచారంలో ఈ విషయాలు వెల్లడి కావడం గమనార్హం.
తాజా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. 2017తో పోల్చుకుంటే గతేడాది రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 3,500(2.4శాతం అధికం) మంది అధికంగా మృతి చెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. 2017లో దాదాపు 1.47 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఇక గతేడాది రోడ్డు ప్రమాదాలు కూడా 2017లో చోటుచేసుకున్న ఘటనల కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. ''2018లో మొత్తంగా 4.67 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,51, 417 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటును రోజుకు 1280 ప్రమాదాలు..415 మరణాలు, ప్రతి గంటకు 53 ప్రమాదాలు.. 17 మరణాలు చోటుచేసుకున్నాయి'' అని రోడ్డు ప్రమాదాలు, మరణాలపై నివేదిక హెచ్చరించింది.
అతివేగమే అతిపెద్దకారణం
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమేననీ, దాదాపు 64.4శాతం మంది ఈ కారణంతోనే మరణించారని నివేదిక వెల్లడించింది. అలాగే రాంగ్సైడ్ డ్రైవింగ్తో 5.8శాతం మరణాలు, మొబైల్ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం కారణంగా 2.4శాతం మంది, డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా 2.8శాతం మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఇంకా.. దాదాపు 29శాతం మరణాలు హెల్మెట్లు వాడకపోవడం కారణంగా చోటుచేసుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది. సీటుబెల్టు ధరించకపోవంతో 16శాతం మంది, ఓవర్లోడ్ వాహనాల కారణంగా 12శాతం మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఇక రోడ్డు ప్రమాద మరణాల్లో యూపీ తొలి స్థానంలో ఉన్నది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్లు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18-35 ఏండ్ల మధ్య ఉన్నవారే (72,737 మంది) అధికంగా ఉండటం గమనార్హం. దేశంలో రోడ్ల స్థితిగతులు సరిగ్గా లేవనీ, పౌరుల భద్రతపై అవగామన కల్పించడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుండటం తో రోడ్డు ప్రమాదాలు, మరణాలు రోజురోజుకూ అధికమవుతున్నాయనీ బాధితులు ఆరోపిస్తున్నారు.
ద్విచక్రవాహన ప్రమాదాలే అధికం
ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల్లో అధికంగా ద్విచక్రవాహనాల యాక్సిడెంట్లే అధికంగా ఉండటం గమ నార్హం. ఇందులో ద్విచక్రవాహనాల వాటా అత్యధికం గా 31.4శాతం ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో కార్లు, జీపులు వంటివి ఉన్నాయి. అలాగే ద్విచక్రవాహనదారుల మరణా లు కూడా అధికంగా 35.2శాతంగా నమోదు కావ డం గమనార్హం. రోడ్డు ప్రమాదాల్లో సైక్లిస్టులు, పాద చారు లు, ద్విచక్రవాహనదారుల మరణాలు 54శాతంగా ఉన్నాయి.